మంథని రూరల్, ఏప్రిల్ 1: సింగరేణి నిర్వాసితుల పునరావాస కాలనీ పనులను త్వరగా పూర్తి చేయాలని జడ్పీ చైర్మన్ పుట్ట మధూకర్ ఆదేశించారు. బిట్టుపల్లి శివారులో రచ్చపల్లి, అక్కెపల్లి నిర్వాసిత గ్రామాల ప్రజల కోసం నిర్మిస్తున్న ఆర్అండ్ఆర్ కాలనీని అదనపు కలెక్టర్ లక్ష్మీనారాయ ణ, ఆర్జీ-3 జీఎం మనోహర్, నిర్వాసిత గ్రామాల ప్రజలతో కలిసి గురువారం పరిశీలించారు. ఈ సందర్భంగా రచ్చపల్లి నిర్వాసిత గ్రామంలో ఇం కా చేపట్టాల్సిన వైకుంఠధామ పనులు, గ్రౌండ్, ఇతరత్రా పనులను త్వరగా పూర్తి చేయాలని సూ చించారు. అలాగే అక్కెపల్లి నిర్వాసితుల కోసం కేటాయించిన స్థలంలో రోడ్లు, మురుగు కాలు వలు, కరెంటు ఇతర అభివృద్ధి పనులను చేపట్టాలని అదనపు కలెక్టర్ సింగరేణి జీఎంకు సూచించారు. ఇక్కడ సర్పంచులు శ్రీనివాస్ యాదవ్, ఎంపీటీసీ మిరియాల ప్రసాద్రావు, పెగడ శ్రీనివాస్ యాదవ్, పీఏసీఎస్ చైర్మన్ కొత్త శ్రీనివాస్, ఆర్బీఎస్ సభ్యుడు ఏగోళపు శంకర్ గౌడ్, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు శంకర్లాల్ ఉన్నారు.