న్యూఢిల్లీ: జియో వరల్డ్ డ్రైవ్. ఇదో ప్రీమియం మాల్. ఈ భారీ రిటేల్ స్టోర్ను ఇవాళ రిలయన్స్ సంస్థ ప్రారంభించింది. ముంబైలోని బాంద్రా కుర్లా కాంప్లెక్స్లో దీన్ని స్టార్ట్ చేశారు. 17.5 ఎకరాల విస్తీర్ణంలో ఈ మాల్ను నిర్మించారు. దీంట్లో 72 అంతర్జాతీయ, భారతీయ బ్రాండ్ల షాపులు ఉన్నాయి. ఆహారానికి సంబంధించిన 27 రకాల ఔట్లెట్లు ఉన్నాయి. భారీ రూఫ్ టాఫ్ థియేటర్తో పాటు ఓపెన్ ఎయిర్ మార్కెట్ కూడా ఉన్నట్లు ఇవాళ రిలయన్స్ ఓ ప్రకటనలో తెలిపింది. జియో డ్రైవ్ ఇన్ థియేటర్ ఓ అద్భుతం అవుతుందని రిలయన్స్ బ్రాండ్స్ లిమిటెడ్ సంస్థ సీఈవో దర్శన్ మెహతా ఓ ప్రకటనలో తెలిపారు. రూఫ్ టాప్ థియేటర్లను పీవీఆర్ ఆపరేట్ చేయనున్నది. జియో థియేటర్ వద్ద సుమారు 290 కార్లకు పార్కింగ్ స్పేస్ కల్పించారు. థియేటర్ వద్ద వీవీఐపీలకు సపరేట్ ఎంట్రీ ఉంటుంది. రెండు డోసుల కరోనా టీకా తీసుకున్న వారికి మాత్రమే ప్రస్తుతం ఎంట్రీ కల్పిస్తున్నారు. ప్రఖ్యాత ఆర్కిటెక్ట్ రాస్ బాన్థోర్న్, ఆండీ లాంపార్డ్లు ఈ మాల్ను డిజైన్ చేశారు. ఫ్రెంచ్ కాన్సెప్ట్ నుయేజ్ ప్రేరణతో దీన్ని నిర్మించారు.