కావలసిన వస్తువులు
పాలు: ఒక లీటర్, చక్కెర: 150గ్రా., జీడిపప్పు, బాదం, పిస్తా: 50గ్రా., కుంకుమ పువ్వు: చిటికెడు,
యాలకుల పొడి: ఒక టీస్పూన్
తయారీ విధానం
ముందుగా స్టవ్మీద ఒక మందపాటి గిన్నె పెట్టి అందులో పాలు పోసి సగం అయ్యేవరకు బాగా మరగనివ్వాలి. ఇప్పుడు పాలు దింపి అందులో చక్కెర, యాలకుల పొడి, కుంకుమ పువ్వు వేసి బాగా కలిపి సన్నగా తరిగిన జీడిపప్పు, బాదం పలుకులు, పిస్తా పై నుంచి వేసి చల్లార్చుకుంటే చాలు. తియ్యతియ్యటి బాసుంది రెడీ. దీన్ని చల్లగా లేదా వేడిగా సర్వ్ చేయవచ్చు.