న్యూఢిల్లీ: సిక్కింలో జల విద్యుత్ కేంద్రాల నిర్మాణం, పురోగతిపై కేంద్ర ఇంధన శాఖ కార్యదర్శి అలోక్ కుమార్ గురు, శుక్రవారాల్లో సమీక్షించారు. ఎన్హెచ్పీసీ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ (సీఎండీ) ఏ కే సింగ్, పవర్ గ్రిడ్ సీఎండీ కే శ్రీకాంత్తో కలిసి సిక్కిం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితో గురువారం సమావేశం అయ్యారు. జల విద్యుత్ కేంద్రాల నిర్మాణంలో సిక్కిం స్పీడ్గా ముందుకు సాగుతున్నదని కేంద్ర కార్యదర్శి అలోక్కుమార్కు సీఎస్ వివరించారు.
తీస్తా నదిపై నాలుగో దశ జల విద్యుత్ కేంద్రం నిర్మాణం, ఎన్హెచ్పీసీ పవర్ స్టేషన్, నిర్మాణంలో ఉన్న వివిధ ప్రాజెక్టుల యధాతధాస్థితిని కేంద్ర ఇంధన శాఖ కార్యదర్శి అలోక్కుమార్, తదితరులకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి వివరించారు.
కేంద్ర ఇంధన శాఖ కార్యదర్శి అలోక్ కుమార్ గురువారం తీస్తా-5 పవర్ స్టేషన్ (ఎన్హెచ్పీసీ)ని సందర్శించారు. ఈ పర్యటనలో పవర్హౌస్లోని వివిధ విభాగాల పనితీరును పరిశీలించారు. పవర్ హౌస్లో పని చేస్తున్న యువ ఉద్యోగులతో చర్చించి.. దాని నిర్వహణ తీరు గురించి తెలుసుకున్నారు.
శుక్రవారం తీస్తా-6 ప్రాజెక్టులో 500 మెగావాట్ల సామర్థ్యంతో నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టును అలోక్ కుమార్ సందర్శించారు. బ్యారేజీ, హెడ్ రేస్ టన్నెల్, అండర్ గ్రౌండ్ పవర్ హౌస్, ట్రాన్స్పార్మర్ కావరిన్ తదితరాలను పరిశీలించారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి