హైదరాబాద్ కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న డాక్టర్ రెడ్డీస్ ల్యాబొరేటరీస్ గిన్నిస్ రికార్డ్ సాధించింది. సున్నిత దంతాల రుగ్మతల పట్ల అవగాహన కల్పించేందుకు ‘ఫాస్ట్మీనార్’ పేరిట టూత్బ్రష్లతో 40 అడుగుల శిల్పాన్ని తయారు చేయడం ద్వారా కంపెనీ ఈ రికార్డు నెలకొల్పింది. 40,000 టూత్బ్రష్లతో కూడిన ఈ పంటి శిల్పాన్ని ముంబైలోని తెర్నా డెంటల్ కాలేజ్లో ఏర్పాటుచేసినట్లు రెడ్డీస్ మంగళవారం విడుదల చేసిన ప్రకటన తెలిపింది.