తెలుగమ్మాయి ఈషా రెబ్బా సోషల్ మీడియాలో చాలా యాక్టివ్. ఒకవైపు సినిమాలతో అలరిస్తూనే మరోవైపు తన పోస్ట్లతో నెటిజన్స్కి వినోదం పంచుతుంది. తాజాగా ఈ ముద్దుగుమ్మ ఇన్స్టాగ్రామ్లో ఓ ఫోటో పోస్ట్ చేయగా, ఇందులో ఎడమ భుజంపై ఎర్రగా కందిన గాయం కనిపిస్తుంది. అది నిజంగా గాయమా లేక ఏదైన మచ్చనా అని అభిమానులు ఆలోచనలో పడ్డారు. వ్యాక్సినేషన్ కారణంగా బొప్పి కట్టి అలా అయి ఉంటుందని కొంతమంది నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. కాగా ఆ మచ్చ వ్యాక్సినేషన్ వల్ల వచ్చింది కాదని కామెంట్లు చేస్తున్నారు.