అమరావతి: ఆంధ్రప్రదేశ్లోని కడప జిల్లాలో దారుణం జరిగింది. కన్నతల్లితోపాటు తోబుట్టువులను హత్యచేశాడో కిరాతకుడు. జిల్లాలోని ప్రొద్దుటూరుకు చెందిన కరీముల్లా అనే వ్యక్తి తల్లి, చెల్లి, తమ్ముడిని కిరాతకంగా చంపేశాడు. అనంతరం స్థానిక పోలీస్ స్టేషన్లో లొంగిపోయాడు. పోలీసులు ఘటన స్థలాన్ని పరిశీలించారు. మృతదేహాలను స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం దవాఖానకు తరలించారు. కుటుంబ కలహాలతోనే వారిని హత్య చేసినట్లు తెలుస్తోంది. అయితే ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవికూడా చదవండి..