వరల్డ్ కప్ రెజ్లింగ్ పోటీలకు రవి కుమార్, దీపక్ పునియా...

ఢిల్లీ:2020 డిసెంబర్, 12వ తేదీ నుంచి 18వ తేదీ వరకు జరిగే సీనియర్ రెజ్లింగ్ వరల్డ్ కప్ పోటీల్లో భారతదేశానికి ప్రాతినిధ్యం వహిస్తున్న 42 మంది సభ్యులు (24 మంది రెజ్లర్లు, 9 మంది కోచ్ లు, ముగ్గురు సహాయ సిబ్బందితో సహా ముగ్గురు 3 రిఫరీలు) సెర్బియాలోని బెల్ గ్రేడ్ వెళ్తున్నారు. కరోనా మహమ్మారి కారణంగా మార్చిలో దేశవ్యాప్తంగా లాక్ డౌన్ విధించిన తరువాత భారత రెజ్లర్లు పాల్గొంటున్న మొదటి అంతర్జాతీయ పోటీ ఇది. క్రీడాకారులు, కోచ్ లు, రిఫరీల విమాన ప్రయాణ టికెట్లు; భోజన, వసతి సౌకర్యాలు; యునైటెడ్ వరల్డ్ రెజ్లింగ్ లైసెన్సు ఫీజు; వీసా ఫీజుతో పాటు వ్యక్తిగత ఖర్చుల కోసం మొత్తం 90 లక్షల రూపాయల వ్యయంతో, ఈ పోటీల్లో పాల్గొనడానికి ప్రభుత్వం ఆమోదం తెలిపింది.
ఈ పోటీల్లో పాల్గొంటున్నరెజ్లర్లు...
పురుషుల ఫ్రీస్టైల్ విభాగం : రవి కుమార్ (57 కిలోలు), రాహుల్ అవేర్ (61 కిలోలు), నవీన్ (70 కిలోలు), గౌరవ్ బలియన్ (79 కిలోలు), దీపక్ పునియా (86 కిలోలు), సత్యావర్త్ కడియన్ (97 కిలోలు), సుమిత్ (125 కిలోలు).
పురుషుల గ్రీకో-రోమన్ విభాగం : అర్జున్ హలకుర్కి (55 కిలోలు), జ్ఞానేందర్ (60 కిలోలు), సచిన్ రానా (63 కిలోలు), అశు (67 కిలోలు), ఆదిత్య కుండు (72 కిలోలు), సజన్ (77 కిలోలు), సునీల్ కుమార్ (87 కిలోలు), హర్దీప్ (97 కిలోలు), నవీన్ (130 కిలోలు)
మహిళల విభాగం : నిర్మలా దేవి (50 కిలోలు), పింకీ (55 కిలోలు), అన్షు (57 కిలోలు), సరిత (59 కిలోలు), సోనమ్ (62 కిలోలు), సాక్షి మాలిక్ (65 కిలోలు), గుర్షరన్ ప్రీత్ కౌర్ (72 కిలోలు), కిరణ్ (76 కిలోలు)
బజరంగ్ పునియా (పురుషుల ఫ్రీస్టైల్ 65 కిలోలు); వినేష్ ఫోగట్ (మహిళల 53 కిలోలు) తో పాటు రవి కుమార్ ,దీపక్ పునియా ల ద్వారా కుస్తీలో భారతదేశం మొత్తం నాలుగు ఒలింపిక్ కోటాలను సాధించింది.
2021 మార్చి నెలలో జరిగే ఆసియా అర్హత పోటీలు 2021 ఏప్రిల్, 29వ తేదీ నుంచి 2021 మే, 2వ తేదీ వరకు జరిగే ప్రపంచ అర్హత పోటీల్లో మిగిలిన కోటాలు సాధించడానికి వారికి మరో రెండు అవకాశాలు ఉంటాయి.
లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
తాజావార్తలు
- రోజు విడిచి రోజు నీరు: ఎమ్మెల్యే కె.పి.వివేకానంద్
- బాలల పరిరక్షణకు చర్యలు
- మౌలిక వసతుల కల్పనకు కృషి
- రేణుకా ఎల్లమ్మదేవి కల్యాణ మహోత్సవం
- లాఠీ..సీటీతో చెత్తపై సమరం!
- ఏప్రిల్ 13 నుంచి భద్రాద్రి రామయ్య బ్రహ్మోత్సవాలు
- ఓటుహక్కు ప్రతి పౌరుడి సామాజిక బాధ్యత
- కొత్త బార్లకు ప్రభుత్వం అనుమతి
- శ్రీవారి సర్వదర్శనం టోకెన్లు 20 వేలు
- రేపు ఉద్యోగులతో త్రిసభ్య కమిటీ భేటీ?