తాజ్ హోటల్పై దాడి.. రతన్ టాటా భావోద్వేగం

హైదరాబాద్: 2008, నవంబర్ 26వ తేదీన ముంబైలో ఉగ్రవాదులు దాడి చేసిన విషయం తెలిసిందే. ఆ మారణహోమానికి నేటితో 12 ఏళ్లు నిండాయి. ఈ నేపథ్యంలో ప్రముఖ పారిశ్రామికవేత్త రతన్ టాటా ఆ దుర్ఘటనపై స్పందించారు. ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్లో ఆయన కొన్ని కామెంట్స్ చేశారు. తాజ్మహల్ ప్యాలెస్ హోటల్ ఫోటోను పోస్టు చేసి.. ఆ విధ్వంసాన్ని మరిచిపోలేమని అన్నారు. వందేళ్ల క్రితం నాటి తాజ్మహల్ హోటల్పై 12 ఏళ్ల క్రితం ఉగ్రవాదులు దాడి చేశారు. ఆ తాజ్ హోటల్ ఓనర్ టాటా గ్రూపే. అయితే ఉగ్రవాదాన్ని ఓడించేందుకు ముంబై ప్రజలు చూపిన తెగువను, సాహసాన్ని రతన్ టాటా మెచ్చుకున్నారు. ముంబై ప్రజలు ఆ రోజు ప్రదర్శించిన సున్నితత్వం భవిష్యత్తులోనూ ప్రజ్వరిల్లుతుందన్నారు. ఉగ్రవాదులు దాడి చేసిన కొన్ని నెలల తర్వాత మళ్లీ తాజ్ హోటల్ను రిపేర్ చేశారు. ఆ రోజు జరిగిన దాడిలో ఆ హోటల్లోనే 31 మంది మరణించారు.
— Ratan N. Tata (@RNTata2000) November 26, 2020
తాజావార్తలు
- ఏప్రిల్ 21న భద్రాద్రి సీతారామ కల్యాణోత్సవం
- ఊహించని ట్విస్ట్.. బాలీవుడ్కు వెళుతున్న నాగ చైతన్య!
- నాటుబాంబు పేలి నలుగురికి తీవ్రగాయాలు
- ఓయూ ప్రీ పీహెచ్డీ పరీక్షలు యథాతథం
- ప్రేమలో ఉన్నట్టు ఒప్పుకున్న రేణూ దేశాయ్
- రాష్ర్టంలో తగ్గుతున్న చలి తీవ్రత
- నేడు నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు
- అరియానా బర్త్డేలో సోహెల్, మోనాల్ల ముద్దు ముచ్చట్లు
- 28 నుంచి గ్రాండ్ నర్సరీ మేళా
- నానిని ఢీ కొట్టబోతున్న నాగ చైతన్య