కర్ణాటకలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. రోజు రోజుకు రికార్డు స్థాయిలో పాజిటివ్ కేసులు
నమోదవుతున్నాయి. గడిచిన 24 గంటల్లో కొత్తగా 49,058 మందికి కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయింది. ఒక్కరోజు వ్యవధిలోనే 328 మంది మరణించారు. 24 గంటల్లో 18,943 మంది డిశ్చార్జ్ అయ్యారు. దీంతో ఇప్పటి వరకు రాష్ట్రంలో నమోదైన మొత్తం కేసుల సంఖ్య 17,90,104కు చేరింది. కరోనా బారినపడి మృతిచెందిన వారి సంఖ్య 17212కు పెరిగింది. ప్రస్తుతం రాష్ట్రంలో 517075 యాక్టివ్ కేసులున్నాయి.