భోపాల్ : మధ్యప్రదేశ్లో దారుణం జరిగింది. అత్యాచారానికి గురైన 16 ఏళ్ల అమ్మాయిని.. 21 ఏళ్ల రేప్ నిందితుడిని తాడుతో కట్టేసి ఊరేగింపు చేసిన ఘటన అలీరాజ్పుర్ జిల్లాలో చోటుచేసుకున్నది. గిరిజన ప్రాభావిత ప్రాంతంలో ఈ ఘటన జరగడం శోచనీయం. బహిరంగంగా గ్రామ ప్రజల ముందు రేప్ బాధితురాలిని, నిందితులను గ్రామస్తులు పరేడ్ చేయించారు. ఈ ఘటనలో పోలీసులు ఆరుగురు వ్యక్తుల్ని అరెస్టు చేశారు. బాధితురాలిని, నిందితుడిని ఊరేగిస్తున్న వీడియో ఒకటి వైరల్ అయ్యింది. భారత్ మాతాకీ జై అంటూ గ్రామస్తులు నినాదాలు చేస్తూ ఆ వీడియోలో కనిపించారు. రేప్ బాధితురాలిని పోలీసులు రక్షించారు. ఈ ఘటనలో రెండు కేసులు నమోదు చేసినట్లు దిలీప్ సింగ్ బిల్వాల్ తెలిపారు. రేప్ బాధితురాలి కుటుంబసభ్యులను కూడా వారితో పరేడ్ చేయించినట్లు తెలుస్తోంది. ఐపీసీ, పోక్సో చట్టాల కింద కేసులు బుక్ చేశారు.