సంకీర్ణ ప్రభుత్వంలో బీజేపీ భాగస్వామి
పుదుచ్చేరి, మే7: పుదుచ్చేరి ముఖ్యమంత్రిగా ఏఐఎన్ఆర్సీ నేత ఎన్ రంగస్వామి ప్రమాణాన్ని స్వీకరించారు. శుక్రవారం నాడిక్కడ రాజ్నివాస్లో లెఫ్టినెంట్ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్, ఆయనతో ప్రమాణం చేయించారు. రంగస్వామి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టడం ఇది నాల్గవసారి. ప్రమాణ కార్యక్రమానికి హాజరైన అనంతరం కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ బీజేపీ, ఏఐఎన్ఆర్సీ పార్టీల నుంచి ముగ్గురేసి చొప్పున మంత్రులు ఉంటారని చెప్పారు.