డిప్యూటీ చైర్పర్సన్గా సుచిత్రా ఎల్లా
హైదరాబాద్, మార్చి 6 (నమస్తే తెలంగాణ): భారత పరిశ్రమల సమాఖ్య(సీఐఐ) దక్షిణాది చైర్మన్గా సీకే రంగనాథన్ నియమితులయ్యారు. 2021-22కిగాను నూతన కార్యవర్గాన్ని సీఐఐ శనివారం ప్రకటించింది. కేవిన్కేర్ సీఎండీగా విధులు నిర్వహిస్తున్న రంగనాథన్..గడిచిన ఆర్థిక సంవత్సరంలో సీఐఐ డిప్యూటీ చైర్మన్గా విధులు నిర్వహించారు. భారత్ బయోటెక్ కో-ఫౌండర్ సుచిత్రా ఎల్లా సీఐఐ డిప్యూటీ చైర్పర్సన్గా ఎంపికయ్యారు. సీఐఐలో కీలక సభ్యురాలుగా కొనసాగుతున్న సుచిత్ర 2012-13లో సీఐఐ ఏపీ చైర్పర్సన్గా విధులు నిర్వహించారు.