లక్నో : అయోధ్యలో నిర్మిస్తున్న రాముడి ఆలయాన్ని (Ayodhya Ram Temple) 2023 డిసెంబర్ కల్లా పూర్తి చేసి భక్తుల సందర్శనార్థం తెరువనున్నారు. 2024 లో జరిగే లోక్సభ ఎన్నికలకు కొన్ని రోజుల ముందు రామాలయాన్ని తెరిచేందుకు ప్రణాళిక సిద్ధం చేశారు. భూమి చదును చేయడం, మట్టితో నింపే పనులు ఇప్పుడిప్పుడే పూర్తవుతున్నాయి.
గత నెల 27-29 తేదీలలో అయోధ్య రాముడి గుడి నిర్మాణంపై ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తున్నది. ముందుగా అనుకున్నట్లుగానే 2023 డిసెంబర్ నాటికి నిర్మాణం పనులు పూర్తిచేసేలా చర్యలు తీసుకోవాలని నిర్ణయించినట్లు సమాచారం. ఈ సమీక్షా సమావేశానికి ట్రస్ట్ కోశాధికారి స్వామి గోవింద్దేవ్ గిరిజీ, ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్, ట్రస్ట్ సభ్యులు విమలేంద్ర మోహన్, ప్రతాప్ మిశ్రా, డాక్టర్ అనిల్ మిశ్రా, కన్స్ట్రక్షన్ కమిటీ చైర్మన్ నృపేంద్ర మిశ్రాతోపాటు టాటా కన్సల్టింగ్ ఇంజినీర్స్, ఎల్ అండ్ టీ అధికారులు కూడా పాల్గొన్నారు.
భూమి చదును చేయడం, తవ్వకాలు జరుపడం వంటి పనులు ఇప్పుడిప్పుడే పూర్తి కావచ్చాయని, ముడి సరుకులు కొనుగోలు చేయడంలో జిల్లా అధికారులు, ప్రభుత్వ సహకారం కీలకమని టాటా, ఎల్ అండ్ టీ అధికారులు అంటున్నారు. 2500 ఏండ్ల వరకు భూకంపాలను తట్టుకుని నిలబడేలా ఆలయం డిజైన్ను రూర్కీలోని సెంట్రల్ బిల్డింగ్ రీసెర్చ్ ఇన్స్టిస్యూట్ సిద్ధం చేసిందని వారు తెలిపారు.
బెంగళూరులో ‘అప్పికో ఉద్యమం’.. ఎందుకంటే?
హజ్మత్ సూట్తో ఉత్తర కొరియా సైన్యం పరేడ్
10 ఏండ్లలో 25 మందితో పరారీ.. అయినా కోపం లేదంటున్న భర్త!
వారణాసి జ్ఞాన్వాపి మసీదు సర్వేపై స్టే
జమ్ముకశ్మీర్లో పర్యటిస్తున్న రాహుల్గాంధీ
ఆఫ్ఘన్ గడ్డ నుంచి ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తే సహించం : ఎస్ జైశంకర్
బాలీవుడ్ నటికి పాకిస్తాన్ కోర్ట్ అరెస్ట్ వారెంట్.. ఎందుకంటే?
జపాన్ యువతలో బుస కొడుతున్న హికికొమోరి
పుటుక నీది, చావు నీది.. బతుకంతా దేశానిది..
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..