న్యూఢిల్లీ, సెప్టెంబర్ 9: అయోధ్యలో రామాలయ నిర్మాణ పనుల్లో తొలి ఘట్టం దాదాపు పూర్తికావొచ్చిందని ఆలయ ట్రస్ట్ తెలిపింది. ఆలయ పునాది పనులు పూర్తయినట్లేనని వెల్లడించింది. అనుకున్న సమయానికి కన్నా ముందుగానే ఈ పనులను పూర్తి చేశామని పేర్కొంది. 2023 చివరినాటికి దర్శనాలను ప్రారంభించాలన్న లక్ష్యాన్ని చేరుకునే దిశగా ముందుకు సాగుతున్నామని వివరించింది. భూకంపాలను సైతం తట్టుకునేలా, పూర్తి పర్యావరణహితంగా ఆలయాన్ని నిర్మిస్తున్నామని ట్రస్ట్ తెలిపింది. ఆలయ నిర్మాణంలో ప్రసిద్ధిగాంచిన రాజస్థాన్ పింక్ స్టోన్ను ఉపయోగించనున్నట్లు పేర్కొంది.