సీఎం కేసీఆర్సహా పలువురు ప్రముఖుల సంతాపం
హైదరాబాద్, ఏప్రిల్ 27 (నమస్తే తెలంగాణ): ఏబీఎన్, ఆంధ్రజ్యోతి సంస్థల ఎండీ వేమూరి రాధాకృష్ణ సతీమణి వేమూరి కనకదుర్గ (63) గుండెపోటుతో మృతిచెందారు. కొన్నిరోజులుగా హైదరాబాద్లోని ఓ ప్రైవేటు దవాఖానలో చికిత్స పొందుతున్న ఆమె మంగళవారం తుదిశ్వాస విడిచారు. ఆమె మృతికి ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు, కాంగ్రెస్ నేత రాహుల్గాంధీ, మహారాష్ట్ర మాజీ గవర్నర్ సీహెచ్ విద్యాసాగర్రావు, తెలంగాణ శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి, మంత్రులు వేముల ప్రశాంత్రెడ్డి, తలసాని శ్రీనివాస్యాదవ్, టీఆర్ఎస్ లోక్సభా పక్షనేత నామా నాగేశ్వర్రావు సంతాపం ప్రకటించారు. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని, ఈ విషాదాన్ని తట్టుకొనేశక్తి భగవంతుడు రాధాకృష్ణ కుటుంబానికి ఇవ్వాలని ప్రార్థించారు.