కోల్కతా: రక్షాబంధన్ నేపథ్యంలో ఆఫ్ఘనిస్థాన్ జాతీయులకు కొందరు మహిళలు రాఖీలు కట్టారు. పశ్చిమ బెంగాల్ ఉత్తర 24 పరగణా జిల్లాలోని డమ్డమ్ ప్రాంతంలో ఆదివారం ఈ కార్యక్రమాన్ని ఆ రాష్ట్రంలోని అధికార తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) ఏర్పాటు చేసింది.
ఈ ప్రాంతంలో నివాసం ఉంటున్న ఆఫ్ఘన్ జాతీయులతోపాటు స్థానికులకు టీఎంసీ మహిళా కార్యకర్తలు రాఖీలు కట్టారు. అయితే ఈ రాఖీలపై సీఎం మమత ఫొటోతోపాటు ‘ఢిల్లీ చలో’ అని బెంగాల్లో రాసి ఉన్నది.