ఎమ్మెల్యే దాసరి మనోహర్రెడ్డి
పల్లె ప్రగతి పనులపై సమీక్ష
పెద్దపల్లి రూరల్, జూలై 13: ప్రభుత్వం గ్రామాల అభివృద్ధిని కాంక్షిస్తూ ప్రవేశపెట్టిన పల్లెప్రగతిని నిరంతరం కొనసాగించేలా చర్యలు చేపట్టాలని పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్రెడ్డి పేర్కొన్నారు. పెద్దపల్లి మండల పరిషత్ కార్యాలయ సమావేశంలో మంగళవారం ఎంపీపీ బండారి స్రవంతీశ్రీనివాస్ గౌడ్ అధ్యక్షతన ప్రజాప్రతినిధులు, వివిధ శాఖల అధికారులతో నాలుగో విడుత పల్లెప్రగతి, ఏడో విడు త హరితహారంపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ.. పారిశుధ్యంపై దృష్టి సారించాలని, ఆరోగ్య, హరిత గ్రామాలుగా తీర్చు దిద్దుకోవాలన్నారు. ఇందుకు ప్రజాప్రతినిధులు, అధికారులు సమన్వయంతో పని చేయాలని సూచించారు. గ్రామాల్లో ట్రాక్టర్లు, ఎక్స్కవేటర్లు వినియోగించి పిచ్చి మొక్కలను తొలగించాలన్నారు. ఖాళీ స్థలాల్లో పిచ్చి మొక్కలుంటే సంబంధిత వ్యక్తులకు నోటీసులివ్వాలని, అయినప్పటికీ తొలగించకుంటే గ్రామపంచాయతీ ద్వారా తొలగించాలన్నారు. ఇందుకు అయిన ఖర్చును సంబంధిత వ్యక్తుల నుంచి వసూలు చేయాలన్నారు. ఎస్సారెస్పీ కాలువలు, చెరువు కట్టలపై పిచ్చి మొక్కలుంటే తొలగించి మొక్కలు నాటాలన్నారు. స్వచ్ఛ శుక్రవారాన్ని పాటించి ఇంటి పరిసరాలు, వీధులు, గ్రామాలను శుభ్రం చేసుకోవాలని సూచించారు. జడ్పీటీసీ బండారి రామ్మూర్తి, జిల్లా సహకార అధికారి, మండల ప్రత్యేకాధికారి మైకేల్ బోస్, పెద్దపల్లి విండో చైర్మన్ మాదిరెడ్డి నర్సింహారెడ్డి, పెద్దపల్లి ఎంపీడీవో ఎం.రాజు, ఎంపీవో సుదర్శన్, ఏపీఎంలు సంపత్కుమార్, దివ్య, ఆయా గ్రామాల పత్యేకాధికారులు, సర్పంచులు, ఎంపీటీసీలు, మహిళా సంఘాల బాధ్యులు పాల్గొన్నారు.
ప్రజారోగ్యమే ప్రభుత్వ ధ్యేయం
కాల్వశ్రీరాంపూర్, జూలై13: ప్రజారోగ్యమే ప్రభుత్వ ధ్యేయమని, ప్రజల సంపూర్ణ ఆరోగ్యం, పరిశుభ్రత కోసమే సీఎం కేసీఆర్ పల్లె ప్రగతి కార్యక్రమాన్ని తీసుకున్నట్లు ఎమ్మెల్యే దాసరి మనోహర్రెడ్డి పేర్కొన్నారు. పల్లెప్రగతి, హరితహారంపై అధికారులు, ప్రజాప్రతినిధులతో మంగళవారం మండల కేంద్రంలో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడారు. అన్ని పల్లెలను సంపూర్ణ పారిశుధ్య గ్రామాలుగా తీర్చిదిద్దాలని సూచించారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకొని, ప్రజలు అనారోగ్యం బారిన పడకుండా అవగాహన కల్పించాలన్నారు. సీజనల్ వ్యాధులు ప్రబలకుండా అప్రమత్తంగా ఉండాలన్నారు. గ్రామాల పరిశుభ్రతలో పంచాయతీ కార్యదర్శుల పాత్ర కీలకమన్నారు. స్వచ్ఛ త, పరిశుభ్రతలో మండలాన్ని ముందుంచాలని సూచించారు. ఎంపీపీ నూనేటి సంపత్, జడ్పీటీసీ వంగళ తిరుపతిరెడ్డి, వైస్ ఎంపీపీ జూకంటి శిరీష, సర్పంచ్ ఆడెపు శ్రీదేవి, ఎంపీడీవో కిషన్, విండో చైర్మన్ చదువు రాంచంద్రారెడ్డి, ఆర్బీఎస్ మండల కోఆర్డినేటర్ నిదానపురం దేవయ్య, కోఆప్షన్ సభ్యుడు ఎండీ ఇబ్రహీం, సర్పంచులు, ఎంపీటీసీలు, ఆయా శాఖల అధికారులు, పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు.