అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్న ఎమ్మెల్యే
వంతెన నిర్మాణంతో సకాలంలో గమ్యస్థానాలకు చేరుకోవచ్చు..
మంచిర్యాలటౌన్, మే 3: పట్టణంలోని ముఖ రాం చౌరస్తా నుంచి హమాలీవాడ వైపునకు రైల్వే శాఖ రూ. 3 కోట్లతో నిర్మిస్తున్న ఆర్వోబీ ప నులను ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్రావు సోమవారం పరిశీలించారు. సంబంధిత అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సం దర్భంగా ఆయన మాట్లాడుతూ రెండు వేర్వేరు మార్గాల్లో వంతెనను నిర్మిస్తుండడంతో ప్రజలకు మరింత సౌకర్యంగా ఉంటుందన్నారు. అంతేగాకుండా సకాలంలో గమ్య స్థానాలకు చేరుకోవచ్చన్నారు. ఆయన వెంట మున్సిపల్ చైర్మన్ పెం ట రాజయ్య, వైస్చైర్మన్ ముఖేశ్గౌడ్, మార్కెట్కమిటీ చైర్మన్ పల్లె భూమేశ్, టీఆర్ఎస్ నాయకులు, కౌన్సిలర్లు, తదితరులు పాల్గొన్నారు.