ముంబై ఆఫీసులో రహస్య కబోర్డ్ను గుర్తించిన పోలీసులు
ముంబై: పోర్నోగ్రఫి రాకెట్ ఆరోపణలతో అరెస్టయిన నటి శిల్పాశెట్టి భర్త రాజ్కుంద్రా చుట్టూ ఉచ్చు బిగుసుకుంటున్నది. కుంద్రా ఆఫీసులో పనిచేసే నలుగురు ఉద్యోగులు పోర్నోగ్రఫి రాకెట్కు సంబంధించిన సమాచారాన్ని ఇచ్చారని, ఈ కేసులో వారు సాక్ష్యులుగా మారినట్టు ముంబై పోలీసు వర్గాలు తెలిపాయి. కుంద్రా ఆఫీసులో ఒక రహస్య కబోర్డును గుర్తించినట్టు పేర్కొన్నాయి. పోర్నోగ్రఫి కంటెంట్ను ప్రసారం చేసే మరో మూడు, నాలుగు యాప్లతో కుంద్రాకు సంబంధాలు ఉన్నాయని అనుమానిస్తున్నట్టు తెలిపాయి.