రాజ్కోట్ : కరోనా వైరస్ కట్టడికి దేశవ్యాప్తంగా వ్యాక్సినేషన్ ప్రక్రియను ముమ్మరం చేయగా రాజ్కోట్లో కొవిడ్ వ్యాక్సిన్ తీసుకున్న వారికి స్ధానిక స్వర్ణకారులు బహుమతులు అందచేస్తున్నారు. మహిళలకు బంగారు ముక్కుపుడకలను, పురుషులకు హ్యాండ్ బ్లెండర్ వంటి గిఫ్ట్లు ఇచ్చి వ్యాక్సిన్ తీసుకునేందుకు ప్రజలను ప్రోత్సహిస్తున్నారు. స్వర్ణకారుల ప్రతినిధులు వ్యాక్సినేషన్ కేంద్రాల వద్ద కాయంప్ను ఏర్పాటు చేసి వ్యాక్సిన్ తీసుకున్నవారికి ఈ బహుమతులను అందిస్తున్నారు.
వ్యాక్సిన్ ద్వారానే మహమ్మారిని నియంత్రించవచ్చని ప్రభుత్వం పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నా ప్రజల్లో ఇంకా వ్యాక్సిన్ పట్ల అపోహలు నెలకొన్నాయి. మరోవైపు వ్యాక్సిన్ తీసుకున్న వారికి స్వర్ణకారులు బహుమతులు అందచేయడాన్ని నెటిజెన్లు స్వాగతిస్తున్నారు. ఇక గుజరాత్లో కరోనా వైరస్ ఆందోళనకరంగా వ్యాప్తి చెందుతోంది. అహ్మదాబాద్, సూరత్, వదోదర వంటి పెద్ద నగరాల్లో కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి.