జైపూర్: పిల్లల చదువుకు ఒంటెలు సహకరిస్తున్నాయి. అవును ఇది నిజమే. కరోనా నేపథ్యంలో గత రెండేండ్లుగా పిల్లల చదువులు సాగడం లేదు. స్కూళ్లు మూతపడటంతో విద్యకు దూరమైన పిల్లలు ఇండ్లకే పరిమితమయ్యారు. కరోనా కేసులు తగ్గిన కొన్ని రాష్ట్రాల్లో ఈ నెల నుంచి స్కూళ్లు తెరుస్తున్నారు. అయితే పలు రాష్ట్ర ప్రభుత్వాలు ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు.
మరోవైపు రాజస్థాన్లోని జోధ్పూర్కు చెందిన ఒక ఎన్జీవో సంస్థ పిల్లల విద్య కోసం వినూత్నంగా ఆలోచించింది. దీని కోసం ఒంటెల సహకారాన్ని తీసుకున్నది. ఒంటెల బండ్లపై పాఠ్య పుస్తకాలతో లైబ్రరీని ఏర్పాటు చేసింది. మారుమూల గ్రామాలకు ఈ ఒంటె బండ్లను పంపి పిల్లలకు విద్య అందిస్తున్నది.
ఒంటెల సహాయంతో చిన్నారులకు చదువు చెబుతున్న ఎన్జీవో సంస్థ చొరవను జోధ్పూర్ పాఠశాల విద్యా విభాగం జాయింట్ డైరెక్టర్ ప్రేమ్ చంద్ సంఖ్లాతోపాటు పలువురు ప్రశంసించారు.