న్యూఢిల్లీ: రాజస్థాన్ రాయల్స్ పేసర్ చేతన్ సకారియాకు పితృవియోగం సంభవించింది. కొన్ని రోజులు క్రితం కరోనా మహమ్మారి బారినపడ్డ చేతన్ సకారియా తండ్రి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఈ ఉదయం కన్నుమూశారు. ఈ విషయాన్ని రాజస్థాన్ రాయల్స్ మేనేజ్మెంట్ వర్గాలు వెల్లడించాయి. చేతన్ సకారియా తండ్రి మృతికి ఆర్ఆర్ మేనేజ్మెంట్ తీవ్ర సంతాపం వ్యక్తంచేసింది. ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేసింద
ఈ ఏడాది కరోనావల్ల అర్ధాంతరంగా నిలిచిపోయిన ఐపీఎల్ సీజన్-14లో చేతన్ సకారియా 7 వికెట్లు తీశాడు. ఇటీవలే టోర్నీ ఆగిపోవడం, ఇప్పుడు తండ్రి కరోనా కాటుకు బలికావడం సకారియాకు తీవ్ర మనోవేదనను మిగిల్చాయి. సకారియా సోదరుడు కూడా నాలుగు నెలల క్రితమే మృతిచెందాడు.