న్యూఢిల్లీ: దేశంలో సరిపడా మెడికల్ ఆక్సిజన్ నిల్వలు ఉన్నాయని చెబుతూనే ఎంత కావాలో అంతే వాడాలని, వృథా చేయొద్దని రాష్ర్టాలకు కేంద్రం సూచించింది. కరోనా రోగులకు చికిత్సలో మెడికల్ ఆక్సిజన్ ఎంతో ముఖ్యం. ఈ నేపథ్యంలో రాష్ర్టాలకు ఆక్సిజన్ను నిరంతరాయంగా సరఫరా చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని పేర్కొంది. దేశంలో రోజుకి 7,127 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ను ఉత్పత్తి చేసే సామర్థ్యం ఉన్నదని, గత రెండు రోజులుగా పూర్తిస్థాయిలో ఉత్పత్తి జరుగుతున్నదని తెలిపింది. మరోవైపు, పీఎం-కేర్ ఫండ్ నిధులతో దేశంలోని వంద కొత్త దవాఖానల్లో సొంతగా ఆక్సిజన్ ప్లాంట్లను ఏర్పాటు చేయనున్నట్టు కేంద్రప్రభుత్వం వెల్లడించింది.