న్యూఢిల్లీ : కరోనా మహమ్మారితో దేశం అల్లాడుతుంటే సెంట్రల్ విస్టా ప్రాజెక్టుపై కేంద్రం ముందుకు వెళ్లడాన్ని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ తప్పుపడుతుండగా రాజస్థాన్ కాంగ్రెస్ సర్కార్ రూ 266 కోట్లతో ఎమ్మెల్యేల కోసం లగ్జరీ హాస్టల్ నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. జైపూర్ లో అత్యాధునిక వసతులతో వందల కోట్లు వెచ్చించి ఎమ్మెల్యేల కోసం లగ్జరీ హాస్టల్ ను కాంగ్రెస్ ప్రభుత్వం నిర్మిస్తోందని బీజేపీ మహిళా మోర్చా సోషల్ మీడియా ఇన్ ఛార్జ్ ప్రీతి గాంధీ ఆరోపించారు.
భారత ప్రజాస్వామ్య సౌథానికి చిహ్నంగా కేంద్రం చేపట్టిన సెంట్రల్ విస్టా ప్రాజెక్టుపై బురదచల్లిన కాంగ్రెస్ పార్టీ రాజస్థాన్ లో వందల కోట్లతో ఎమ్మెల్యేల కోసం విలాసవతంమైన హాస్టల్ నిర్మిస్తుంటే విపక్ష నేతలు ప్రశ్నించడం లేదని ఆమె దుయ్యబట్టారు. మరోవైపు మహారాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ఎమ్మెల్యేల కోసం లగ్జరీ అపార్ట్ మెంట్ల నిర్మాణానికి రూ 900 కోట్లను మంజూరు చేసింది.