జైపూర్: ఆక్సిజన్ సమస్య వల్ల కరోనా రోగులను మరో ఆసుపత్రికి అంబులెన్స్లో తరలిస్తుండగా ఒక రోగి మరణించాడు. రాజస్థాన్లోని అల్వార్లో గురువారం రాత్రి ఈ ఘటన జరిగింది. 53 ఏండ్ల తన అన్న ఆక్సిజన్ సపోర్ట్పై ఉన్నారని, మరో ఆసుపత్రిలో అడ్మిట్కు 30 నిమిషాలపాటు వేచి ఉంచడం వల్ల చనిపోయినట్లు సోదరుడు ఆరోపించారు.
మరోవైపు లార్డ్స్ ఆసుపత్రిలోని ఆక్సిజన్ సరఫరా పైప్ లైన్లో సమస్య వచ్చిందని, దీంతో సీరియస్గా ఉన్న ఐదుగురు కరోనా రోగులను అంబులెన్స్లో రాజీవ్ గాంధీ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారని వైద్య అధికారి సునీల్ కుమార్ చౌహాన్ తెలిపారు. ఐసీయూ వార్డులోకి తరలించిన అనంతరం ఒక కరోనా రోగి చనిపోయినట్లు ఆయన చెప్పారు.