నర్సంపేట, ఏప్రిల్ 22: కాలుష్యం బారి నుంచి భూమిని కాపాడేందుకు ప్రతి ఒక్కరూ తమవంతు కృషి చేయాలని పర్యావరణ వేత్త, వనప్రేమి అవార్డు గ్రహీత గోక రామస్వామి పిలుపునిచ్చారు. ప్రపంచ ధరిత్రి దినోత్సవం సందర్భంగా స్వయంకృషి సోషల్ వర్క్స్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో పట్టణంలోని ప్రైవేట్ పాఠశాలలో గురువారం సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఓజోన్పొర దెబ్బతిని వాతావరణంలో విపరీతమైన మార్పులు సంభవిస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. అందరూ మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు. సదస్సులో బెజ్జంకి ప్రభాకర్, పాఠశాల డైరెక్టర్ జావిద్, ప్రకాశ్, సుకన్య, సునీత, శ్రీలత, వీరభద్రయ్య, రాము, ఇలియాస్, రాజు, భద్రయ్య, అశోక్ తదితరులు పాల్గొన్నారు.
వాతావరణ సమతుల్యతను కాపాడాలి
వాతావరణ సమతుల్యతను కాపాడాలని ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ బీ చంద్రమౌళి కోరారు. గురువారం నర్సంపేటలోని డిగ్రీ కళాశాలలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. వ్యవసాయంలో విప్లవాత్మక మార్పులు అవసరమని, పునరుత్పాదక విధానాలను అమలు చేయాలన్నారు. కార్యక్రమంలో అధ్యాపకులు నరేందర్, శ్రీనాథ్, గంటిశెట్టి శ్రీనివాస్, రమేశ్, సుమతి, విష్ణుకుమార్, ప్రసూన, సమ్మయ్య, సత్యనారాయణ, నరేందర్, కుమారస్వామి పాల్గొన్నారు.
‘స్వేచ్ఛ శ్రీసేవా’ సంస్థ ఆధ్వర్యంలో..
నర్సంపేట రూరల్: మండలంలోని దాసరిపల్లి గ్రామంలో స్వేచ్ఛ శ్రీసేవా స్వచ్ఛంద సంస్థ కార్యదర్శి పెండ్యాల సురేందర్ ఆధ్వర్యంలో ప్రపంచ ధరిత్రి దినోత్సవ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామంలో మొక్కలు నాటి నీళ్లు పోశారు. అనంతరం సంస్థ కార్యదర్శి సురేందర్ మాట్లాడుతూ.. విశాల విశ్వంలో జీవమున్న అరుదైన గ్రహం భూమి అని అన్నారు. భూమిపైన కాలుష్యం రోజు రోజుకూ పెరుగుతోందన్నారు. ప్రపంచ ధరిత్రి దినోత్సవాన్ని ప్రతి ఏడాది జరుపుకుంటున్నారని తెలిపారు. కార్యక్రమంలో గ్రామ పెద్దలు, యువకులు రమేశ్, రాజు, శ్రీను, వీరన్న, భాస్కర్, తిరుపతి పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి
డబుల్ మాస్క్ ఎందుకు వాడాలి..?
మెర్సిడేస్ కార్లున్న టాలీవుడ్ సెలబ్రిటీలు వీళ్లే..!