జైపూర్ : రాజస్ధాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లోత్కు ఛాతీ నొప్పి రావడంతో వైద్యులు యాంజియోప్లాస్టీ నిర్వహించనున్నారు.ఈ ఏడాది ఏప్రిల్ గెహ్లోత్కు కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయింది. కొవిడ్ అనంతరం తనకు ఆరోగ్య సమస్యలు ఎదురయ్యాయని, గురువారం నుంచి ఛాతీ నొప్పి రావడంతో ఎస్ఎంఎస్ దవాఖానలో శుక్రవారం పరీక్షలు నిర్వహించారని యాంజియోప్లాస్టీ నిర్వహించనున్నారని గెహ్లోత్ (70) ట్వీట్ చేశారు. గుండె రక్తనాళాల్లో పూడికలను సరిచేసేందుకు యాంజియోప్లాస్టీ చేస్తారు. తన ఆరోగ్యం నిలకడగా ఉందని, త్వరలోనే ప్రజలు, శ్రేయోభిలాషుల ఆశీస్సులతో బయటకు వస్తానని ఆయన పేర్కొన్నారు.