హైదరాబాద్, ఆగస్టు 20 (నమస్తే తెలంగాణ): హైదరాబాద్ డీఆర్డీవోలోని రిసెర్చ్ సెంటర్ ఇమారత్ (ఆర్సీఐ) డైరెక్టర్గా ప్రముఖ శాస్త్రవేత్త ఉమ్మలనేని రాజాబాబు నియమితులయ్యారు. ఆయన ప్రస్తుతం డాక్టర్ అబ్దుల్ కలాం మిస్సైల్ కాంప్లెక్స్లోని ఆర్సీఐకి ప్రోగ్రాం డైరెక్టర్గా పనిచేస్తున్నారు. ప్రోగ్రాం డైరెక్టర్గా రాజాబాబు ఎన్నో కీలక విధుల్లో పాలుపంచుకున్నారు. బాలిస్టిక్ మిస్సైల్ సిస్టమ్స్ తయారీలో అత్యంత కీలకమైన డిజైన్ను రూపొందించారు. భారత మొదటి యాంటీ శాటిలైట్ మిస్సైల్ (ఏ-శాట్) మిషన్ శక్తిని రాజాబాబు నాయకత్వంలో విజయవంతంగా పరీక్షించారు.