అభివృద్ధిని చూసే టీఆర్ఎస్లో చేరికలు : ఎమ్మెల్సీ పోచంపల్లి08
త్రిపురారం, ఏప్రిల్ 3 : ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధిని చూసే ప్రజలంతా టీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నారని వరంగల్ ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్రెడ్డి, మహబూబాబాద్ ఎమ్మెల్యే బాణోతు శంకర్నాయక్, ఎస్వీవీ చైర్మన్ వాసుదేవరెడ్డి అన్నారు. మండల కేంద్రంలో కాంగ్రెస్కు రాజీనామా చేసి టీఆర్ఎస్లో చేరిన 35 కుటుంబాల వారికి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. రైతుబంధు సమితి జిల్లా అధ్యక్షుడు ఇస్లావత్ రాంచందర్నాయక్, నిడమనూరు మార్కెట్ కమిటీ చైర్మన్ కామెర్ల జానయ్య, మండలాధ్యక్షుడు బహునూతల నరేందర్, నాయకులు మర్ల చంద్రారెడ్డి, భరత్రెడ్డి, అనంతరెడ్డి, జంగిలి శ్రీనివాస్ పాల్గొన్నారు. మండల కేంద్రంలోని 140మంది దివ్యాంగులకు ఎస్వీవీ చైర్మన్ వాసుదేవరెడ్డి ఐడీ కార్డులను పంపిణీ చేశారు. కార్యక్రమంలో సర్పంచ్ అనుముల శ్రీనివాస్రెడ్డి, నాతి శైలజ, ఫరీదా, రాములు, పుష్పలత పాల్గొన్నారు.
సర్పంచ్ భర్త, వార్డు సభ్యుల చేరికలు..
త్రిపురారం మండలంలోని అంజనపల్లిలో ఇటీవల మృతిచెందిన సర్పంచ్ బుర్రి మల్లమ్మ భర్త బుర్రి వెంకయ్యతోపాటు, నలుగురు వార్డు సభ్యులు, నీలాయిగూడెం వార్డు సభ్యుడు గోపి ఎమ్మెల్యే శంకర్నాయక్ సమక్షంలో టీఆర్ఎస్లో చేరారు. వారందరికీ పార్టీ కండువాలు కప్పి ఆహ్వానించారు. కార్యక్రమంలో మిర్యాలగూడ జడ్పీటీసీ, తిప్పన విజయసింహారెడ్డి, రాంచందర్నాయక్, బహునూతల నరేందర్, జయరాంనాయక్, చంద్రారెడ్డి, అనంతరెడ్డి, భారతిరెడ్డి, వెంకటేశ్వర్లు, ధర్మారెడ్డి, నాగయ్య, వెంకటాచారి, వెంకటయ్య, లింగయ్య, సైదులు, శ్రీను, భిక్షం పాల్గొన్నారు.
వడ్డెరులంతా టీఆర్ఎస్ వెంటే..
సాగర్ నియోజకవర్గంలోని వడ్డెరులంతా టీఆర్ఎస్లో ఉంటామని ఆ పార్టీ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు, తార్నాక కార్పొరేటర్ అలకుంట హరి అన్నారు. శనివారం మండల కేంద్రంలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ వడ్డెరులంతా ఏకమై టీఆర్ఎస్కు ఓటేసి నోముల భగత్ను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఈ సమావేశంలో వేముల సైదులు, పల్లపు సైదులు, పల్లపు గోపి, పల్లపు శ్రీను, శ్రీనివాస్, చంద్రయ్య, వేముల వెంకటేశ్వర్లు, విక్రమ్, ప్రశాంత్, కృష్ణ, గండికోట చీనా పాల్గొన్నారు.