ప్రముఖ స్మార్ట్ఫోన్ తయారీ సంస్థ షియోమీ పలు ఉత్పత్తులను ఆవిష్కరించేందుకు సిద్ధమైంది. ఈ ఏడాది ఆరంభంలోనే మిగతా కంపెనీల కన్నా ముందే కొత్త కొత్త ప్రొడక్టులను లాంచ్ చేసిన షియోమీ అదే జోరు కొనసాగిస్తోంది. మార్చి 29న మెగా లాంచ్ ఈవెంట్ను నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. ఎంఐ 11 ప్రొ, ఎంఐ 11 ఆల్ట్రా, ఎంఐ మిక్స్ సిరీస్లను కూడా అదేరోజున మార్కెట్లోకి విడుదల చేసే అవకాశం ఉంది. ఐతే ఎంఐ స్మార్ట్ బ్యాండ్ 6ను మాత్రం మార్చి 29న రిలీజ్ చేస్తామని ట్విటర్లో ప్రకటించింది. బ్యాండ్ 5ని గతేడాది జూలైలో విడుదల చేసిన షియోమీ దానికి కొనసాగింపుగా బ్యాండ్ 6ను కూడా తీసుకొస్తున్నది.