జైపూర్: పాకిస్థాన్ ఏజెంట్కు భారత సైన్యం రహస్య పత్రాలను అందజేస్తున్న భారతీయ రైల్వేలో తపాలాఫీసు అధికారి (27) ని మిలిటరీ నిఘా అధికారులు శుక్రవారం అరెస్ట్చేశారు. దీనిపై కేసు నమోదు చేశామని, దర్యాప్తు కొనసాగుతుందని మిలిటరీ నిఘా అధికారులు చెప్పారు.
సదరు వ్యక్తిని భారతీయ రైల్వేలోని జైపూర్ తపాలాశాఖాధికారిగా భారత్ బావ్రి అని గుర్తించారు. అతడు హానీట్రాప్లో చిక్కుకున్నారని తేలింది. సోషల్ మీడియా వేదికగా సదరు రహస్య పత్రాలను అందజేస్తామని పాకిస్థాన్ నిఘా సంస్థ ఐఎస్ఐకి ఇచ్చిన సమాచారం ఆధారంగా మిలిటరీ నిఘా అధికారులు గుర్తించారు.
4,5 నెలల క్రితం ఆయనకు ఓ మెసేజ్ వచ్చింది. పాక్ ఐఎస్ఐ మహిళా ఏజెంట్ తాను ఎంబీబీఎస్ విద్యార్థినని, పోర్ట్ బ్లయర్లో చదువుతానని ఫేస్బుక్ ద్వారా పరిచయం పెంచుకున్నది. అటుపై వాట్సాప్ వాయిస్, వీడియో కాల్స్తో మాట్లాడుకునేవారు. తన బంధువులు ఆర్మీలో ఉన్నారని సదరు మహిళ నమ్మ బలికిందని దర్యాప్తు అధికారులు చెబుతున్నారు.