తెలుగు, తమిళ సినిమాలతో ప్రేక్షకులను అలరించిన సీనియర్ నటుడు కార్తీక్ కొన్నాళ్ళుగా రాజకీయాలతో బిజీగా ఉన్నారు. మనిద ఉరిమై కట్చి (మానవ హక్కుల పార్టీ) వ్యవస్థాపకుడుగా పని చేస్తున్న కార్తీక్.. తన మద్దతును అన్నాడీఎంకే–బీజేపీ కూటమికి ప్రకటించారు. ఈ పరిస్థితుల్లో ప్రచారం ముగించుకుని శనివారం రాత్రి ఇంటికి వెళ్లారు. అర్ధరాత్రి ఆయన అస్వస్థతకు గురవడంతో ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. శ్వాస సంబంధింత సమస్యలతో ఆయన బాధపడుతున్నట్టు తెలుస్తుంది.
కోలీవుడ్ సీనియర్ నటుడు కార్తీక్ కుమారుడు గౌతమ్ కూడా వెండితెర ఆరంగేట్రం చేయబోతున్న సంగతి తెలిసిందే. గౌతమ్ నటిస్తున్న చిత్రంలో రాజశేఖర్ కూతురు శివాత్మిక కథానాయికగా నటించనుంది. కాగా, మణిరత్నం దర్శకత్వంలో తెరకెక్కిన “ఘర్షణ, విలన్” వంటి చిత్రాల్లో నటించి తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితుడైన కార్తీక్ తన బయోపిక్ను తానే తీసేందుకు కూడా సమాయత్తమవుతున్నాడు