తిరువనంతపురం: కేరళలో కరోనా మహమ్మారి విజృంభిస్తున్నది. గత కొన్ని రోజులుగా ఏ రోజూ 40 వేలకు తగ్గకుండా కొత్త కేసులు నమోదవుతున్నాయి. బుధవారం సాయంత్రం నుంచి గురువారం సాయంత్రం వరకు గడిచిన 24 గంటల్లో కూడా కొత్తగా 42,464 మందికి కరోనా పాజిటివ్ వచ్చింది. దాంతో కేరళలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 3,90,906కు చేరింది.
అదేవిధంగా గడిచిన 24 గంటల్లో కొత్తగా 63 మంది కరోనా బాధితులు ప్రాణాలు కోల్పోయారు. దాంతో కేరళలో ఇప్పటి వరకు కరోనా బారినపడి మరణించిన వారి సంఖ్య 5,628కి చేరింది. ఇక గడిచిన 24 గంటల్లో 27,152 మంది బాధితులు కరోనా నుంచి సురక్షితంగా బయటపడ్డారు. దాంతో మొత్తం రికవరీల సంఖ్య 13,89,515కు చేరింది.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
పురివిప్పిన మయూరం.. కనువిందు చేసిన నాట్యం.. వీడియో
వర్షాలు కురువాలని కప్పలకు పెండ్లి..వీడియో
ఆర్ఎల్డీ అధినేత, కేంద్ర మాజీ మంత్రి అజిత్ సింగ్ కరోనాతో కన్నుమూత
దర్శకుడికి కరోనా.. చికిత్సకు సాయం చేసిన కమెడీయన్
ఇంటినుంచే ఇంజినీరింగ్ పరీక్షలు
తెలంగాణలో కొత్తగా 6,026 కరోనా కేసులు