న్యూఢిల్లీ: కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ ఒక ఇంజినీర్ను దగ్గరకు తీసుకుని హత్తుకున్నారు. తాను విద్యనభ్యసించిన ఇంజినీరింగ్ కాలేజ్లోనే ఆయన కూడా చదివారని తెలుసుకుని ఈ మేరకు స్పందించారు. రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ రైల్వేకు చెందిన సిగ్నల్ డిపార్ట్మెంట్ను సందర్శించారు. ఈ సందర్భంగా అధికారి ఒకరు అక్కడి సిబ్బందిని ఆయనకు పరిచయం చేశారు. ఆ డిపార్ట్మెంట్కు చెందిన ఒక ఇంజినీర్ కూడా జోధ్పూర్లోని ఎంబీఎం ఇంజినీరింగ్ కాలేజ్కు చెందిన వారని చెప్పారు. దీంతో ‘రండి హత్తుకుందాం’ అని మంత్రి అశ్విని వైష్ణవ్ ఆ ఇంజినీర్ను పిలిచి దగ్గరకు తీసుకున్నారు. కాలేజ్లోని జూనియర్లు సీనియర్లతో ఇలా వ్యవహరించడంతోపాటు వారిని ‘బాస్’ అని పిలిచేవారని గుర్తు చేశారు. ఈ నేపథ్యంలో ఇప్పటి నుంచి తనను ‘బాస్’ అని పిలువాలని తాను చదివిన కాలేజ్కు చెందిన ఆ ఇంజినీర్తో నవ్వుతూ అన్నారు.