వాతావరణంలో కర్బన ఉద్గారాలను తగ్గించి నగరాల్లో మెరుగైన జీవన ప్రమాణాలను కల్పించేందు కు చేపట్టాల్సిన చర్యలపై ఆన్లైన్ వేదికగా ప్రపంచ వ్యాప్తంగా జరగనున్న మెట్రో నగరాల సదస్సులో మేయర్ విజయలక్ష్మి ప్రసంగించనున్నారు. యునైటెడ్ నేషన్స్ ఇన్ఫర్మేషన్, కమ్యూనికేషన్ టెక్నాలజీ ఆధ్వర్యంలో నిర్వహించనున్న గ్లోబల్ మేయర్ల సమావేశంలో పాల్గొనేందుకు హైదరాబాద్ మేయర్ విజయలక్ష్మిని ఆహ్వానించా రు. ప్రపంచంలోని 40 నగరాలకు చెందిన మేయర్లు మాత్రమే ఈ వెబ్ ఆధారిత సదస్సులో పాల్గొననున్నారు. కాగా, భారతదేశం నుంచి కేవలం హైదరాబాద్ నగర మేయర్కు మాత్రమే ఈ అవకాశం లభించింది. శుక్రవారం (నేడు) ర్రాతి 8:15 గంటల నుంచి 10:15 గంటల వరకు జరిగే ఈ సదస్సులో మేయర్ ప్రసంగించన్నురు. ఇందులో భాగంగా ఐక్యరాజ్య సమితి సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటారెస్ స్వాగతోపన్యాసం చేయనున్నారు. ఈ సదస్సు నిర్వహణలో ప్రధాన పాత్ర వహిస్తున్న లాస్ ఎం జెల్స్ మేయర్ ఎరిక్ గర్సెట్టి అధ్యక్ష స్థానంలో ఉపన్యాసం చేస్తారు. కొవి డ్-19 మహమ్మారిని అధిగమించడం, హరిత, పర్యావరణ పరిరక్షణకు చేపట్టాల్సిన చర్యలు, నిర్ధారిత లక్ష్యాలపై మేయర్లు ప్రసంగిస్తారు.