వరంగల్ చౌరస్తా, ఏప్రిల్ 15 : వేగంగా విస్తరిస్తున్న కరోనాను ఎదుర్కోవడానికి ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. ఇందులో భాగం గా కరోనా వైద్యసేవలు అం దించడానికి ప్రైవేట్ దవాఖానలకు అనుమతులు మం జూరు చేసింది. దీంతో వరంగల్ అర్బన్ జిల్లా వ్యాప్తంగా సుమారు 6060 అదనపు పడకలు అందుబాటులోకి రానున్నాయి. ఐదు అంతకు మించి పడకలు కలిగిన దవాఖానలు ప్రభుత్వం సూచించిన విధివిధానాలను పాటిస్తూ కరోనా వైద్యసేవలు అందించడానికి అవకాశం కల్పించింది. దీంతో వరంగల్ అర్బన్ జిల్లా పరిధిలో సుమారు 176 దవాఖానల్లో కరోనా వైద్యం అందుబాటులోకి రానుంది. ప్రస్తుతం వరంగల్ ఎంజీఎంలోని కొవిడ్ 19 విభాగం ద్వారా 440 పడకలతో వైద్యసేవలు అందిస్తున్న ప్రభుత్వం గతంతో గతంలో 14 ప్రైవేట్ దవాఖానలకు అనుమతులు మంజూరు చేసింది. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో సుమారు ఐదు వేలకుపైగా పడకలు అందుబాటులోకి వస్తున్నట్లు అధికారులు తెలిపారు.
ఐఎంఏలో అవగాహన సదస్సు
ప్రభుత్వ నిబంధనలను వివరిస్తూ వరంగల్ ఐఎంఏ హాల్లో జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో కొవిడ్ ట్రీట్మెంట్ ప్రొటోకాల్పై అవగాహన సదస్సును గురువారం నిర్వహించారు. ఈ సందర్భంగా వరంగల్ ఎంజీఎం సూపరింటెండెంట్ డాక్టర్ నాగార్జునారెడ్డి, వరంగల్ ఐఎంఏ తానా విభాగం అధ్యక్షుడు డాక్టర్ ప్రవీణ్కుమార్ మాట్లాడుతూ లక్షణాలు కలిగి ఉన్న వారికి, అనుమానితులకు తక్షణమే పరీక్షలు నిర్వహించి, వ్యాధి నిర్ధారణ చేసుకోవాలన్నారు. సరైన సమయంలో తగిన చికిత్స అందించాలని సూచిచారు. వరంగల్ అర్బన్ అదనపు డీఎంహెచ్వో డాక్టర్ మదన్మోహన్రావు మాట్లాడుతూ కరోనా సెకండ్ వేవ్ను ఎదుర్కోవడానికి వైద్యులు అందరూ సహకరించాలని కోరారు. కార్యక్రమంలో ఎంజీఎం ప్రొఫెసర్ డాక్టర్ పవన్, డాక్టర్ సునీత, డాక్టర్ సుదీప్, మాస్ మీడియా అధికారి అశోక్రెడ్డి పాల్గొన్నారు.