న్యూఢిల్లీ: జమ్మూకశ్మీర్ ( Jammu Kashmir ) లో ఇటీవల డ్రోన్ల దాడులు ( Drone Attacks ) ఘటనలు చోటుచేసుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆ రాష్ట్రంలో ఇవాళ ఎన్ఐఏ ( NIA ) 14 చోట్ల సోదాలు నిర్వమిస్తున్నది. రెండు కేసులకు సంబంధించిన ఆ తనిఖీలు జరుగుతున్నాయి. జమ్మూ ఎయిర్పోర్ట్ వద్ద ఉన్న ఎయిర్ఫోర్స్ బేస్పై కొన్ని వారాల క్రితం డ్రోన్ దాడి జరిగిన విషయం తెలిసిందే. ఉగ్రవాద సంస్థ లష్కరే ముస్తాఫాకు చెందిన మరో కేసులోనూ ఎన్ఐఏ సోదాలు నిర్వహిస్తున్నది. సోఫియాన్, అనంతనాగ్, బనిహల్తో పాటు సుంజవాన్ లో నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ రెయిడ్స్ చేస్తోంది. జూన్ 27వ తేదీన జరిగిన డ్రోన్ దాడిలో ఇద్దరు ఐఏఎఫ్ దళ సిబ్బంది గాయపడ్డ విషయం తెలిసిందే.