న్యూఢిల్లీ : త్వరలోనే దేశంలో మిక్స్ వ్యాక్సిన్ ట్రయల్స్ ప్రారంభించే అవకాశాలు ఉన్నాయి. ఈ విషయాన్ని ఇమ్యునైజేషన్పై జాతీయ సాంకేతిక సలహా బృందం (ఎన్టీఏజీఐ) చైర్మన్ డాక్టర్ ఎన్కే అరోరా సోమవారం ట్విట్టర్ ద్వారా తెలిపారు. త్వరలో రెండు వేర్వేరు మోతాదుల కొవిడ్ వ్యాక్సిన్ను పరీక్షించనున్నట్లు ఆయన చెప్పారు. వ్యాధి నిరోధక ప్రతిస్పందనను పెంచడానికి ఎంతమేర సహాయపడుతుందో తెలుసుకునేందుకు రెండు వేర్వేరు వ్యాక్సిన్లను కలిపే నియమావళి సాధ్యత ట్రయల్స్ ప్రారంభించనున్నట్లు డాక్టర్ అరోరా వెల్లడించారు.
జూన్ నుంచి కోవిడ్ వ్యాక్సిన్ను 10-12 కోట్ల మోతాదులో ఉత్పత్తి చేస్తానని సీరం ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా ఒక లేఖలో పేర్కొన్నది. సీరం ఉత్పత్తిలో ఇది 50 శాతం పెరుగుదలగా ఉన్నది. అదేవిధంగా, భారత్ బయోటెక్ కూడా కోవాక్సిన్ ఉత్పత్తిని పెంచబోతున్నది. జూలై చివరి నాటికి 10 నుంచి 12 కోట్ల డోసులను ఉత్పత్తి చేయనున్నారు. కాగా, ఆగస్టు నాటికి దేశానికి నెలకు 20-25 లక్షల వ్యాక్సిన్ల మోతాదు అందుతుందని అరోరా తెలిపారు. 5 నుంచి 6 కోట్ల మోతాదులు ఇతర తయారీ యూనిట్ల నుంచి లభిస్తుందని భావిస్తున్నట్లు చెప్పారు. విదేశాల నుంచి కూడా వ్యాక్సిన్లు అందినట్లయితే, నిత్యం కోటి మందికి వ్యాక్సిన్లు ఇవ్వవచ్చునని తెలిపారు.
రేపటి నుంచి పలు విషయాల్లో మార్పులు.. మీరూ తెలుసుకోండి..!
కరోనా ఉన్నా రెండంకెల్లో దేశ జీడీపీ వృద్ధి.. ఆర్థికవేత్తల అంచనా
ముంబైలో కొత్త బంగ్లా కొన్న అజయ్ దేవగన్
ఆర్థిక ఇబ్బందులతో సర్రోగేట్ తల్లులుగా అమ్మాయిలు
సిగరెట్ స్మోకింగ్తో ఆరోగ్య సమస్యలు ఎన్నో..!
మువ్వన్నెల జెండాకు కాంగ్రెస్ గుర్తింపు.. చరిత్రలో ఈరోజు
వానాకాలం కరోనా వైరస్తో జాగ్రత్త.. ఇవి పాటించండి..!
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..