శ్రీనగర్ : జమ్ముకశ్మీర్లో ఆర్టికల్ 370 ఎత్తివేసిన తర్వాత తొలిసారిగా కాంగ్రెస్ ఎంపీ, ఏఐసీసీ మాజీ అధ్యక్షుడు అయిన రాహుల్గాంధీ (Rahul Gandhi) సోమవారం సాయంత్రం శ్రీనగర్లో పర్యటించారు. ఇవాళ కూడా రాహుల్ జమ్ములోనే ఉండనున్నారు. జమ్ముకశ్మీర్ పీసీసీ అధ్యక్షుడి ఇంట్లో వివాహ విందుకు హాజరైన రాహుల్ గాంధీ.. మంగళవారం నాడు శ్రీనగర్లో నిర్మించిన కాంగ్రెస్ హెడ్క్వార్టర్స్ భవనాన్ని ప్రారంభించారు. శ్రీనగర్ విమానాశ్రయంలో రాహుల్కు స్థానిక కాంగ్రెస్ నేతలు ఘనంగా స్వాగతించారు.
రెండు రోజుల పర్యటన నిమిత్తం రాహుల్ గాంధీ సోమవారం సాయంత్రం జమ్ముకశ్మీర్ వచ్చారు. సోమవారం రాత్రి పీసీసీ చీఫ్ గులాం అహ్మద్ మీర్ నివాసంలో జరిగిన వివాహ వింధుకు హాజరై నూతన వధూవరులను అభినందించారు. ఈ విందుకు హాజరైన గుప్కార్ నేతలతో అక్కడే భేటీ అయ్యారు. ఫారుఖ్ అబ్దుల్లా, మెహబూబా ముఫ్తి, మహమ్మద్ యూసుఫ్ తారిగామి తదితరులు రాహుల్గాంధీతో పలు విషయాలపై చర్చించారు.
మంగళవారం ఉదయం గందర్బాల్ జిల్లాలోని ఖీర్భవానీ ఆలయానికి వెళ్లిన రాహుల్.. అక్కడ ప్రత్యేక పూజలు చేశారు. అక్కడికి సమీపంలో ఉన్న హజరత్బాల్ మసీదును సందర్శించి చాదర్ సమర్పించారు. ఆ తర్వాత షేక్ హంజా మఖ్దూం సమాధితోపాటు గురుద్వారాను కూడా సందర్శించారు. అక్కడి నుంచి నేరుగా శ్రీనగర్ చేరుకుని అక్కడి నిర్మించిన జమ్ముకశ్మీర్ పీసీసీ హెడ్క్వార్టర్స్ భవనాన్ని ప్రారంభించారు. ఇక్కడ పార్టీ నేతలు, కార్యకర్తలతో సమావేశం కానున్నారు. రానున్న ఎన్నికలు, ఇక్కడి రాజకీయ పరిణామాలపై చర్చించనున్నారు. అనంతరం సాయంత్రం తిరిగి ఢిల్లీ వెళ్లనున్నారు.
అంతరిక్షంలో వరుడు.. టెక్సాస్లో వధువు.. వీడియో కాల్లో పెండ్లి
డయాబెటిస్ చికిత్సలో ‘స్మార్ట్’ ఇన్సులిన్
రక్తంలో షుగర్ నియంత్రణకు కృత్రిమ క్లోమం
రెండో సెషన్ ఐపీఎల్ కోసం కొత్త నిబంధన.. అదేంటంటే..?
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..