మంచిర్యాల ఎమ్మెల్యే దివాకర్రావు
సింగరేణి కార్మిక ప్రాంతంలో పర్యటన
సీసీసీ నస్పూర్, జూన్ 1: ప్రభుత్వం తీసుకున్న ముందస్తు చర్యలతోనే కరోనా వైరస్ కట్టడి సాధ్యమైందని, పూర్తిస్థాయి లో కేసులు తగ్గుముఖం పట్టేందుకే సీఎం కేసీఆర్ మరోసారి లాక్డౌన్ పొడిగించారని ఎమ్మెల్యే దివాకర్రావు పేర్కొన్నారు. నస్పూర్ మున్సిపాలిటీలో మంగళవారం ఆయన విస్తృతంగా పర్యటించారు. నస్పూర్కాలనీ నుంచి గోదావరికాలనీ షి ర్కే ప్రధాన రహదారి, శ్రీరాంపూర్ బ స్టాండ్కు ఇరువైపులా ఉన్న షాపు ల్లో తి రుగుతూ ప్రజలు, వ్యాపారులకు కొవిడ్ కట్టడికి తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు. కార్యక్రమంలో చైర్మన్ ఈసంపల్లి ప్రభాకర్, వైస్ చైర్మన్ తోట శ్రీనివా స్, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు వంగ తి రుపతి, కౌన్సిలర్లు మర్రి మొగిలి, కుర్మిల్ల అన్నపూర్ణ, బండి పద్మ, బోయ మల్ల య్య, బెడికె లక్ష్మి, కోఆప్షన్ సభ్యుడు నా సర్, నాయకులు ఏనుగు రవీందర్రెడ్డి, అన్నయ్య, ఎండీ హైమద్, జక్కుల రాజే శం, అక్కూరి సుబ్బయ్య, కమలాకర్రా వు, మల్లెత్తుల రాజేంద్రపాణి, పంబాల ఎర్రయ్య, సయ్యద్ ఖాసీం, దగ్గుల మ ధు, కాటం రాజు, రవిగౌడ్, గడ్డం శ్రీనివాస్గౌడ్, తదితరులు పాల్గొన్నారు.