Rahul Visit to Jammu | కాంగ్రెస్ పార్టీ నేత రాహుల్ గాంధీ ఈ నెల 9,10 తేదీల్లో జమ్ము పర్యటనకు వెళ్లనున్నారు. రియాజీ జిల్లాలోని త్రికూట పర్వత శ్రేణుల్లో ఉన్న మాతా వైష్ణోదేవి ఆలయంలో ఆయన ప్రత్యేక ప్రార్థనలు చేయనున్నారు. నెల రోజుల్లో జమ్ముకశ్మీర్లో రాహుల్ పర్యటించడం ఇది రెండోసారి. ఈ సందర్భంగా రాహుల్ గాంధీ జమ్ము డివిజన్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగిస్తారు.
గత నెల 10న ఖీర్ భవానీ దేవాలయంతోపాటు హజరత్ దర్గాను రాహుల్ గాంధీ సందర్శించారు. గందేర్బాల్లోని ఖీర్ భవానీ దేవాలయంలో కశ్మీరీ పండిట్లు పూజలు చేస్తారు. 2019లో జమ్ముకశ్మీర్ను కేంద్ర పాలిత ప్రాంతంగా ప్రకటించిన తర్వాత త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి. ఈ నేపథ్యంలో రాహుల్ ఆ రాష్ట్రంలో పర్యటించడం ప్రాధాన్యం సంతరించుకున్నది.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
రిలయన్స్కు లక్ష కోట్ల లబ్ధి.. టాప్-9 బెనిఫిట్ ఎంతంటే?!
హైదరాబాద్లో పవర్గ్రిడ్ చార్జింగ్ స్టేషన్! ఎప్పుడంటే?!
Tesla HatchBach Affordable| 2023లో చౌకగా హ్యాచ్బ్యాక్ టెస్లా కారు.. ధరెంతంటే?!