దుబాయి : ఈ నెల 23 నుంచి భారత్కు విమాన సర్వీసులు ప్రారంభిస్తున్నట్లు దుబాయి ఎమిరేట్స్ ఎయిర్లైన్స్ తెలిపింది. భారత్తో పాటు దక్షిణాఫ్రికా, నైజీరియాకు సైతం సర్వీసులు నడుపనున్నట్లు పేర్కొంది. అయితే, ఆయా దేశాల నుంచి ప్రయాణాలు సురక్షితంగా సాగేందుకు దుబాయి సుప్రీం కమిటీ ఆఫ్ క్రైసిస్ అండ్ డిజాస్టర్ మేనేజ్మెంట్ కొవిడ్ ప్రోటోకాల్స్ పాటించాలని సూచించింది. ఈ మేరకు వాటిని ఎమిరేట్స్ స్వాగతించిందని ఎయిర్లైన్స్ ప్రతినిధి ఓ ప్రకటనలో తెలిపారు. యూఏఈ ఆమోదించిన టీకా రెండు మోతాదులను తీసుకున్న.. చెల్లుబాటయ్యే నివాస వీసా ఉన్న ప్రయాణికులను భారత్ నుంచి దుబాయిలోకి అనుమతించనున్నట్లు విపత్తు నిర్వహణ సుప్రీం కమిటీ శనివారం తెలిపింది. ప్రయాణానికి 48 గంటల ముందు తీసుకున్న ఆర్టీపీసీఆర్ కరోనా నెగెటివ్ సర్టిఫికెట్ను సమర్పించాలని సూచించింది.