న్యూఢిల్లీ : భారతీయులందరికీ ఉచితంగా వ్యాక్సిన్ వేయాలని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ గురువారం కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. పౌరులందరికీ ఎలాంటి చార్జి వసూలు చేయకుండా వ్యాక్సినేషన్ ప్రక్రియ అమలు చేయాలని కోరారు. ఈసారి ప్రజలందరికీ వ్యాక్సిన్ లభిస్తుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నానని ఆయన ట్వీట్ చేశారు.
ఫ్రీ అనే పదానికి డిక్షనరీ అర్ధాన్ని తెలుపుతూ రాహుల్ ట్వీట్ లో ప్రస్తావించారు. మరోవైపు కాంగ్రెస్ నేతలు సైతం అన్ని వయసుల వారికి ఉచితంగా వ్యాక్సిన్ వేయాలని కోరారు. ఇక వ్యాక్సిన్లకు కొరత లేకుండా అన్ని చర్యలూ చేపడతామని రాష్ట్రాలకు తగినంతగా వ్యాక్సిన్ సరఫరాలు చేపట్టామని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ హర్షవర్ధన్ పేర్కొన్నారు.