ఖానాపూర్ మున్సిపల్ చైర్మన్ అంకం రాజేందర్
పలుచోట్ల జీలుగ విత్తనాల పంపిణీ
ఖానాపూర్ టౌన్, మే 24 : రైతు సంక్షేమానికి సీఎం కేసీఆ ర్ కృషి చేస్తున్నారని ఖానాపూర్ మున్సిపల్ చైర్మన్ అంకం రాజేందర్ పేర్కొన్నారు. ఖానాపూర్ ప్రాథమిక సహకార సంఘం ఆధ్వర్యంలో సబ్సిడీ విత్తన విక్రయ కేంద్రాన్ని సోమ వారం ఆయన ప్రారంభించారు. రైతులకు సబ్సిడీపై జీలుగ విత్తనాలను అందజేశారు. ఈ సందర్భంగా చైర్మన్ మాట్లాడుతూ రాయితీ విత్తనాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. పీఏసీఎస్ చైర్మన్ ఇప్ప శ్రీనివాస్ రెడ్డి, ఏఎంసీ చైర్మన్ కడార్ల గంగనర్సయ్య, ఎంపీపీ అబ్దుల్ మొయిద్, మున్సిపల్ వైస్ చైర్మన్ అబ్దుల్ ఖలీల్, ఏఎంసీ వైస్ చైర్మన్ శనిగారపు శ్రావణ్, మున్సిపల్ కోఆప్షన్ సభ్యుడు బండారి కిశోర్, సీఈవో భూమి ఆశన్న పాల్గొన్నారు.
విత్తనాలను సద్వినియోగం చేసుకోవాలి
దస్తురాబాద్, మే 24 : రాష్ట్ర ప్రభుత్వం సబ్సిడీపై అంది స్తున్న జీలుగ విత్తనాలను రైతులు సద్వినియోగం చేసుకో వాలని ఎంపీపీ సింగరి కిషన్ కోరారు. మండల కేంద్రంలో ప్రాథమిక సహకార సంఘం ఆధ్వర్యంలో రాయితీపై జీలుగ విత్తనాలను ప్రజాప్రతినిధులు, నాయకులు, అధికారులతో కలిసి ఆయన రైతులకు పంపిణీ చేశారు. 30 కిలోల బ్యాగ్ రూ. 561కు లభిస్తుందని పేర్కొన్నారు. ఏవో సంధ్యారాణి సర్పంచ్లు అప్పని ప్రభాకర్, భూక్యా బిల్ సింగ్, పీఏసీఎస్ డైరెక్టర్ చుంచు వెంకన్న, ఏఈవోలు తిరుపతి, సత్యనారాయ ణ, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు ముడికే ఐలయ్య యాదవ్, రామడుగు రమేశ్రావు, నిమ్మతోట శివయ్య, బాదం లక్ష్మీ రాజం, దీటి సత్తన్న, చించోలి రాములు పాల్గొన్నారు.
జీలుగ ద్వారా భూసారానికి మేలు
లక్ష్మణచాంద, మే 24 : పంట పొలాల్లో జీలుగ వేయడం ద్వారా భూసారం పెరుగుతుందని మండల వ్యవసాయాధి కారి ప్రవీణ్ కుమార్ పేర్కొన్నారు. మండల కేంద్రంలోని రైతు వేదికలో ఎంపీపీ కేశం లక్ష్మి, జడ్పీటీసీ ఓస రాజేశ్వర్ జీలుగ విత్తనాలను రైతులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడు తూ ఆగ్రోస్ సేవా కేంద్రంలో జీలుగ అందుబాటు లో ఉన్నాయని తెలిపారు. రైతు బంధు సమితి మండల కన్వీ నర్ సాతం గంగారాం, లక్ష్మణచాంద సర్పంచ్ సురకంటి ము త్యంరెడ్డి, నాయకులు అడ్వాల రమేశ్, కేశం రమేశ్, కోఆప్షన్ సభ్యుడు సిరాజొద్దీన్, ఏఈవో ఉమామహేశ్వరి పాల్గొన్నారు.
కడెంలో..
కడెం, మే 24 : కడెంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో రైతులకు జీలుగ విత్తనాలను ఎంపీ పీ అంథోని అలెగ్జాండర్ పంపిణీ చేశారు. రైతులు సబ్సిడీ జీలు గ విత్తనాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. రైతు బంధు సమితి మండల అధ్యక్షుడు హపావత్ రాజేందర్నాయక్, జిల్లా కోఆప్షన్ సభ్యుడు రఫిక్ హైమద్, పీఏసీఎస్ చైర్మన్ రామడుగు శైలజ, ఏవో సంధ్యారాణి, నాయకులు చక్రపాణి, కానూరి సతీశ్, రాజేశ్వర్రెడ్డి ఉన్నారు.