కరోనా మహమ్మారి వలన మంచి మంచి సినిమాలను డైరెక్ట్గా ఓటీటీలో విడుదల చేసే పరిస్థితి నెలకొంది. సూర్య నటించిన ఆకాశం నీ హద్దురా, మోహన్ లాల్ నటించిన దృశ్యం 2 వంటి చిత్రాలు ఓటీటీలో విడుదలై అతి పెద్ద విజయం సాధించాయి. ఇవి థియేటర్ లో విడుదలైతే బాక్సాఫీస్ షేక్ కావడం ఖాయం అని విశ్లేషకులు సైతం అన్నారు. అయితే దృశ్యం 2 చిత్ర రిలీజ్ సమయంలో థియేటర్స్ తెరచుకున్నప్పటికీ ఆ మూవీని ఓటీటీలో విడుదల చేయడం అందరిని ఆశ్చర్యపరిచింది.
మలయాళంలో విజయం సాధించిన దృశ్యం 2 చిత్రాన్ని ఇప్పుడు తెలుగులోను రీమేక్ చేస్తున్నారు. ఈ మూవీ చిత్రీకరణ తుది దశకు చేరుకుంది. ఒరిజినల్ వర్షన్ కు దర్శకత్వం వహించిన జీతూ జోసెఫ్ తెలుగు వర్షన్ కు కూడా దర్శకత్వం వహిస్తున్నాడు. మలయాళ నిర్మాణ సంస్థతో కలిసి సురేష్ ప్రొడక్షన్స్ లో సురేష్ బాబు ఈ రీమేక్ ను నిర్మిస్తున్నాడు. జూన్లో సినిమాను విడుదల చేయాలని అనుకున్నారు. కాని ప్రస్తుత పరిస్థితులు చూస్తే అప్పటి వరకు కరోనా తగ్గేలా కనిపించడం లేదు. దీంతో దృశ్యం 2 తెలుగు వర్షన్ ను కూడా ఓటీటీ లో విడుదల చేసే అవకాశం ఉందంటున్నారు. విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం అమెజాన్ ప్రైమ్ వీడియో వారు దృశ్యం 2 సినిమా కోసం భారీ ఆఫర్ ఇచ్చారట. చిత్రంలో వెంకీ సరసన మీనా కథానాయికగా నటించింది.