మేడ్చల్, జూన్ 5: కరోనా నివారణకు ఇస్తున్న కొవిడ్ టీకా కార్యక్రమం పకడ్బందీగా కొనసాగుతున్నదని మేడ్చ ల్ మున్సిపల్ చైర్ పర్సన్ దీపికానర్సింహారెడ్డి అన్నారు. మేడ్చల్ పట్టణంలోని జడ్పీ బాలుర ఉన్నత పాఠశాలలో నిత్యసేవకుల టీకా కార్యక్రమాన్ని చైర్పర్సన్ శనివారం ప్రారంభించారు. నిత్య సేవకులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ రమేశ్, కమిషనర్ సత్యనారాయణరెడ్డి, కౌన్సిలర్లు మణికంఠగౌడ్, ప్రియాంకామధుకర్, ఉమానాగరాజు, సర్సింహాస్వామి, మహేశ్, గణేశ్, శివకుమార్, సాయికుమార్, నాగరాజు, నాయకులు నర్సింహారెడ్డి, సందీప్గౌడ్, రాఘవేందర్గౌడ్, మధుకర్యాదవ్, మున్సిపల్ సిబ్బంది, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.
మేడ్చల్ రూరల్ : గుండ్లపోచంపల్లి మున్సిపాలిటీ పరిధిలోని వ్యాపార, వాణిజ్య సంస్థల నిర్వాహకులు, వీధి వ్యాపారులకు టీకా వేసే కార్యక్రమాన్ని శనివారం ఆరోగ్య ఉపకేంద్రంలో మున్సిపాలిటీ చైర్పర్సన్ మద్దుల లక్ష్మీశ్రీనివాస్ రెడ్డి ప్రారంభించారు.కార్యక్రమంలో వైస్ చైర్మన్ ప్రభాకర్, కమిషనర్ అమరేందర్రెడ్డి, ఆర్వో శ్రీనివాస్ గౌడ్, కౌన్సిలర్లు జైపాల్రెడ్డి, బాలరాజు, హేమంత్రెడ్డి, హంసరాణి, సరస్వతి, టీఆర్ఎస్ మున్సిపాలిటీ అధ్యక్షుడు సంజీవగౌడ్, భానుచందర్ పాల్గొన్నారు.
మేడ్చల్ కలెక్టరేట్ :నాగారం, దమ్మాయిగూడ మున్సిపాలిటీలలో సూపర్ స్ప్రెడర్స్కు కొవిడ్ టీకా కేంద్రాన్ని మున్సిపల్ చైర్మన్ కౌకుట్ల చంద్రారెడ్డి ప్రారంభించారు. కార్యక్రమంలో కమిషనర్లు ఏ.వాణిరెడ్డి, స్వామి, మండల వైద్యాధికారి సరిత, కౌన్సిలర్లు, ఏఎన్ఎంలు, ఆశ వర్కర్లు పాల్గొన్నారు.
శామీర్పేట: తూంకుంట మున్సిపాలిటీలోని జడ్పీహెచ్ఎస్లో కొవిడ్ టీకా సెంటర్ను మున్సిపాలిటీ చైర్మన్ కారంగుల రాజేశ్వర్రావు ప్రారంభించారు. శనివారం తూంకుంటలో 96 మందికి వ్యాక్సిన్ వేశారు. కార్యక్రమంలో కౌన్సిలర్ రాజ్కుమార్యాదవ్, కో-ఆప్షన్ సభ్యుడు శ్రీధర్రెడ్డి, కమిషనర్ గంగాధర్, మేనేజర్ శ్రవణ్కుమార్, ఏఈ రాకేశ్రెడ్డి, పారిశుధ్య ఇంజినీర్ గణేశ్, ఆరోగ్య సిబ్బంది పాల్గొన్నారు.
జవహర్నగర్ కార్పొరేషన్లోని బాలాజీనగర్ జడ్పీ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన టీకా సెంటర్లను కమిషనర్ గోపి, మేనేజర్ నాగేశ్ ప్రారంభించారు. రెండు సెంటర్లలో మొత్తం 297కి టీకాలు వేసినట్లు చెప్పారు. కార్యక్రమంలో కార్పొరేషన్ సిబ్బంది,సిబ్బంది ఉన్నారు.