హాంగ్కాంగ్ : వివాదాస్పద దక్షిణ చైనా సముద్ర ప్రాంతంలో వందలాది పడవను చైనా మోహరించింది. ఇలా మోహరించడం వల్ల పరిస్థితులను చైనా పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ (పీఎల్ఏ) నిశితంగా సమీక్షిస్తున్నది. ఈ పడవల్లో పీఎల్ఏ సైనికులు ఉన్నట్లు తెలుస్తున్నది. ఈ ప్రాంతాన్ని నిశ్శబ్దంగా ఆక్రమించే స్థితిలో చైనా ఉన్నట్లుగా కనిపిస్తున్నది. పాశ్చాత్య దేశాల నిపుణుల అభిప్రాయం ప్రకారం, జపాన్, ఫిలిప్పీన్స్, మలేషియా వంటి దేశాలతో వివాదంలో ఉన్నందున.. నేరుగా వారితో యుద్ధానికి వెళ్ళకపోవడం వల్ల చైనా ఈ పద్ధతిని అనుసరిస్తున్నట్లుగా తెలుస్తున్నది.
మాక్సర్ టెక్నాలజీస్ దక్షిణ చైనా సముద్రంలో ఉన్న విట్సన్ రీఫ్ వద్ద చైనా నౌకల ఉపగ్రహ చిత్రాన్ని విడుదల చేసింది. వందలాది చిన్న పడవలు సముద్రంలో తేలియాడుతున్నట్లు ఫొటోల్లో స్పష్టంగా కనిపిస్తున్నది. నీలం రంగు పడవలు చైనా మిలిటరీచే నియంత్రించబడుతున్నాయని, దక్షిణ చైనా సముద్రంతోపాటు వెలుపల వారి వాదనలను పెంచుకునే ప్రయత్నాల్లో ఇదంతా భాగమని నిపుణులు అంటున్నారు. వివాదాస్పద ప్రాంతాల్లో తన ఉనికిని కలిగి ఉండాలని చైనా బలంగా కోరుకుంటున్నట్లుగా తెలుస్తున్నది.
ఇంతకు ముందెప్పుడూ చైనా బోట్ల ఇంత పెద్ద ఎత్తున ఆపరేషన్ చేపట్టడం చూడలేదని సింగపూర్లోని ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ స్ట్రాటజిక్ స్టడీస్ నిపుణుల చెప్తున్నారు. చైనా నుంచి దాదాపు 200 ఫిషింగ్ బోట్లు ఫిలిప్పీన్స్ ఆక్రమిత విట్సన్ రీఫ్ చుట్టూ గుమిగూడినప్పుడు సముద్ర మిలీషియా వార్తల్లో ముఖ్యాంశాలుగా మారింది.
కచ్ వద్ద పాకిస్తానీయుల పట్టివేత.. 150 కోట్ల హెరాయిన్ స్వాధీనం
66 ఏండ్ల క్రితం ప్రారంభమైన మెక్డోనాల్డ్.. చరిత్రలో ఈరోజు
భారత్లో బోరిస్ జాన్సన్ పర్యటన కుదింపు
చంద్రుడిపై రోవర్ను పంపేందుకు జపాన్తో జతకట్టిన అరబ్ ఎమిరేట్స్
ఎవర్ గివెన్ను స్వాధీనం చేసుకోండి : ఈజిప్ట్ కోర్టు
జూన్ 1 నుంచి హాల్మార్క్ నగలే అమ్మాలి..
టీకా వేసుకోండి.. ఎక్కువ వడ్డీ పొందండి..!
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..