కొలంబో: మిసెస్ శ్రీలంక పోటీల్లో వివాదం కారణంగా మిసెస్ వరల్డ్-2020 కరోలినా జ్యూరీ తన టైటిల్ను వదులుకొన్నారు. ఆదివారం నిర్వహించిన మిసెస్ శ్రీలంక-2021 పోటీల్లో పుష్పిక డిసిల్వ విజేతగా నిలిచారు. అయితే, ఆమె విడాకులు తీసుకొన్నారని ఆరోపిస్తూ డిసిల్వ తలపై ఉన్న కిరీటాన్ని కరోలినా దురుసుగా లాగేయటంతో ఆమెకు గాయమైంది. ఈ ఘటనపై కరోలినా అరెస్టయి, బెయిల్పై విడుదలయ్యారు. వివాదం నేపథ్యంలో తన టైటిల్ను వదులుకున్నారు.