న్యూఢిల్లీ : కరోనా వైరస్ కట్టడిపై కేంద్ర ప్రభుత్వ తీరును కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ తప్పుపట్టారు. కేంద్రం కొవిడ్-19 పై పోరాడాలని కాంగ్రెస్ పార్టీపై కాదని మోదీ సర్కార్ కు హితవు పలికారు. కొవిడ్-19పై మోదీ సర్కార్ పోరాడాలని కాంగ్రెస్ ఇతర రాజకీయ ప్రత్యర్ధులపై కాదని వారు గుర్తెరగాలని రాహుల్ మంగళవారం ట్వీట్ చేశారు. కరోనా సంక్షోభాన్ని ప్రభుత్వం సమర్ధంగా ఎదుర్కోలేదని, ఆక్సిజన్ పడకలు, అత్యవసర మందుల కొరతతో రోగులను దవాఖానల్లో చేర్చుకోవడం లేదని దుయ్యబట్టారు.
మరోవైపు కరోనా మహమ్మారితో ఇబ్బందులు ఎదుర్కొనే వారికి సాయం కోసం పీసీసీల ఆధ్వర్యంలో కంట్రోల్ రూమ్ లను ఏర్పాటు చేసినట్టు కాంగ్రెస్ పార్టీ పేర్కొంది. ఢిల్లీలో నెలకొల్పిన కంట్రోల్ రూమ్ ఆయా రాష్ట్రాల్లో పార్టీ కంట్రోల్ రూమ్ ల పనితీరును పర్యవేక్షిస్తుంది. కంట్రోల్ రూమ్ పర్యవేక్షకులిగా మనీష్ చత్రా, అజయ్ కుమార్, పవన్ ఖేరా, గుర్దీప్ సింగ్ సత్పాల్ ను పార్టీ చీఫ్ సోనియా గాంధీ నియమించారని ఏఐసీసీ వర్గాలు తెలిపాయి.